Anand Mahindra | బెంగళూరు : బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా నీటి పొదుపు గురించి ఎక్స్లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతున్నది. ఏసీ కండెన్సర్కు ఓ సన్నని పైపు బిగించి ఆ నీటిని ఓ పెద్ద పైపులోకి పంపి దాని చివర నల్లాను అటాచ్ చేస్తే ఏసీ నుంచి వృథాగా వచ్చే నీరు పెద్ద పైపులో నిల్వ అవుతుందని మహీంద్రా తెలిపారు.
ఈ నీటిని వాహనాలను కడగడానికి, మొక్కల కోసం ఉపయోగించవచ్చునని తెలిపారు. “నీరే సంపద” అని, దేశవ్యాప్తంగా ఇటువంటి పరికరాలు అందుబాటులో ఉండాలన్నారు.