కొచ్చి: బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఓ మొబైల్ స్టోర్ను ప్రారంభించేందుకు 2017 ఆగస్టులో కేరళ రాష్ట్రం కొచ్చి సిటీకి వెళ్లింది. ఈ సందర్భంగా రోడ్డు మార్గాన తెల్లటి కారులో సన్నీ లియోన్ స్టోర్ దగ్గరికి వెళ్తుంటే ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. భారీగా ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం పూర్తిగా ఓ మహా జనసంద్రంగా మారిపోయింది.
అయితే, తప్పుడు ఫొటోలతో ప్రచారం చేసుకోవడంలో ముందుండే ఓ పార్టీ కార్యకర్తలు సన్నీ లియోన్ ర్యాలీ ఫొటోను కూడా విడిచిపెట్టలేదు. ఈ నెల 24న కొచ్చిలో ప్రధాని నిర్వహించిన రోడ్ షో ఫొటోగా పేర్కొంటూ సన్నీ లియోన్ ర్యాలీ ఫొటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఫొటోను ఆరేళ్ల క్రితమే తన ట్విటర్ ఖాతాలో సన్నీ లియోన్ పోస్టు చేసి తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపింది.
కాగా, సన్నీ లియోన్ ర్యాలీలో ఆమె తెల్ల కారులో వెళ్తుంటే కారుకు ఎటుచూసినా దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరం వరకు జనం కిక్కిరిసిపోయారు. కానీ ప్రధాని కొచ్చి రోడ్ షోలో ఆయన రోడ్డు మధ్యన ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తుంటే జనాలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి వీక్షించారు. కానీ రోడ్డు మధ్యలో జనాలు లేరు. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం సోయి కూడా లేకుండా సన్నీ లియోన్ను చూసేందుకు వచ్చిన జనాన్ని ప్రధాని రోడ్ షోకు వచ్చిన జనంగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్లో అసలు విషయం బయటపడింది.