బెంగళూరు, మే 17: మొదటిసారి విమానం ఎక్కిన వ్యక్తి నిబంధనలు తెలియక బీడీ కాల్చి అరెస్టయిన ఘటన బెంగళూరులో బుధవారం జరిగింది. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు ఆకాశ్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేస్తున్నారు. విమానంలోని టాయిలెట్లో బీడీ కాల్చడంతో గమనించిన తోటి ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విమానం బెంగళూరుకు చేరుకోగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మొదటిసారి విమానం ఎక్కానని, తనకు నిబంధనలు తెలియదని సదరు వ్యక్తి వాపోయారు. ప్రతిసారి రైలు ప్రయాణం చేస్తానని, టాయిలెట్లో బీడీ తాగడం అలవాటని అందుకే ఇక్కడా తాగినట్టు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపారు.