తిరువనంతపురం : కొజికోడ్ ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కార్గో కంపార్ట్మెంట్ నుంచి ఫైర్ వార్నింగ్ రావడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ఈ విమానం కాలికట్ నుంచి కువైట్ బయల్దేరిన కాసేపటికే ఫైర్ వార్నింగ్ వచ్చింది. ఈ సమయంలో విమానంలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. విమానం ల్యాండ్ అవగానే అక్కడికి అగ్నిమాపక దళాలు వెళ్లాయి. పరిస్థితిని అగ్నిమాపక దళాలు పర్యవేక్షిస్తున్నాయి.