న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘నిరక్షరాస్యుడు దేశానికి భారం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చదువుకోని వారు ఎప్పటికీ ఉత్తమ పౌరులు కాలేరని చెప్పారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ తొలిసారి పదవి చేపట్టి ఈ నెల 7వ తేదీకి 20 ఏండ్లు. అప్పటి నుంచి ఆయన అధికారంలోనే ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమిత్ షా సంసద్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలియనప్పుడు, బాధ్యతలను గుర్తెరగనప్పుడు ఎవరైనా ఎలా ఉత్తమ పౌరులు కాగలుగుతారని ప్రశ్నించారు.