ముంబై: భారీ వర్షాలకు ఒక వంతెనపై రైలు రెండు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న తాత చేతి నుంచి జారిన ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు (Infant slips into drain). ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఆ శిశువు కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భారీగా వర్షాలు కురుస్తున్న మహారాష్ట్రలో ఈ విషాద సంఘటన జరిగింది. బుధవారం ఒక వ్యక్తి తన కుమార్తె యోగితా శంకర్ రుమాలే, ఆరు నెలల మనువడితో కలిసి అంబర్నాథ్ లోకల్ రైలులో ప్రయాణించాడు. అయితే రైలు పట్టాలపైకి నీరు చేరడంతో కళ్యాణ్, ఠాకుర్లీ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న పత్రి కాలువ బ్రిడ్జీపై ఆ రైలు నిలిచిపోయింది. రెండు గంటలకుపైగా అక్కడి నుంచి కదలలేదు.
కాగా, ఆ కుటుంబం రైలు దిగింది. చేతిలోని బాబుతో కాలువ దాటేందుకు తల్లి ప్రయత్నించింది. అయితే ఆమె జారడంతో తండ్రి సహాయం చేశాడు. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న మనవడ్ని తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బాబు అతడి చేరి నుంచి జారి కింద ప్రవహిస్తున్న కాలువలో పడి కొట్టుకుపోయాడు. షాకైన తండ్రీ, కుమార్తెలు ఆ బిడ్డ కోసం కాలువ వద్ద ఏడ్చారు.
మరోవైపు, ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే పోలీసులు, స్థానిక మున్సిపల్ సిబ్బంది కాలువలో పడిన శిశువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాలువ ప్రవాహానికి కొట్టుకుపోయిన పసి బాబు జాడ తెలియలేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ అంశంపై స్పందించారు. ప్రజలు తమ ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు. అలాగే ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెస్క్యూ సిబ్బందిని ఆదేశించారు.
A six-month-old infant slipped from her grandfather's arms and fell into an overflowing drain under the railway tracks between Maharashtra's Kalyan and Thakurli railway stations on Wednesday.
Full story: https://t.co/7z7giXctdt
(@divyeshas | @saurabhv99) #Maharashtra #mumbai pic.twitter.com/766CIqmqYa— IndiaToday (@IndiaToday) July 19, 2023