చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారు నివ్వెరపోయారు. (TN BJP, DMK candidates hugs on Holi) డీఎంకేకు చెందిన తమిజాచి తంగపాండియన్, దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను అదే స్థానం నుంచి బరిలోకి బీజేపీ దించింది.
కాగా, డీఎంకే అభ్యర్థి తమిజాచి, బీజేపీ అభ్యర్థి తమిళిసై సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద ఎదురుపడిన వారిద్దరూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అలాగే ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపై అభినందనలు తెలుపుకున్నారు. తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య రాజకీయ విరోధం పెరుగుతున్నది. ఈ తరుణంలో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇలా మర్యాద పూర్వకంగా హగ్ చేసుకోవడం, హోలీ శుభాకాంక్షలు తెలియజేయడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.