హైదరాబాద్ : వినియోగదారులకు అవసరాలను గుర్తించి తదనుగుణంగా అమేజాన్ వినూత్నసేవలంది స్తోందని అమేజాన్ బిజినెస్ డైరక్టర్ సుచిత్ సుభాస్ అన్నారు. భారతదేశంలో గత నాలుగు సంవత్సరాలలో అమేజాన్ బిజినెస్ జర్నీ గురించి ఆయన మాట్లాడారు. 2017లో ప్రారంభమైన నాటి నుంచి తమ విభిన్నమైన వ్యాపార అవసరాలకు సరఫరా చేయడానికి ప్రముఖ బ్రాండ్లలో15 కోట్లకుపైగా జీఎస్టీ సదుపాయంకలిగిన ఉత్పత్తులతో కీలకమైన గమ్యస్థానంగా ఎంఎస్ఎంఈలకు సాధికారిత కలిగించడానికి అమేజాన్ బిజినెస్ ఎంతో కృషి చేస్తుందన్నారు.
ఎంఎస్ఎంఈలు, పోటీధరలు, విస్త్రతమైన డెలివరీ నెట్ వర్క్ కి లభించే విస్త్రతమైన ఎంపిక వలన అన్ని వ్యాపార అవసరాలుకోసం ఇది కీలకమైన గమ్యస్థానంగా మారింది. భారతదేశం వ్యాప్తంగా 99.5శాతం పిన్ కోడ్స్ తో, దేశంలో సుదూర ప్రాంతాలు నుంచి వ్యాపారాలు తమ కొనుగోళ్లు అవసరాలు కోసం అమేజాన్ బిజినెస్ పై ఆధారపడి నడుస్తున్నాయని అమేజాన్ బిజినెస్ డైరక్టర్ సుచిత్ సుభాస్ పేర్కొన్నారు. భారతదేశంలో అతిపెద్ద జీఎస్టీ స్టోర్ గా తమ అమేజాన్ బిజినెస్ నిలిచిందని, గత నాలుగేళ్లల్లో, మేము చేర్చిన కొన్ని ఫీచర్లు ద్వారా వ్యాపారాలు సులభంగా జీఎస్టీ ఇన్ వాయిస్, ఆధునిక వ్యాపార విశ్లేషణా సాధనాల్ని పొందేవీలుకలుగుతుందని ఆయన వెల్లడించారు.