జమ్ము : జమ్మూ మార్గంలో మూడో రోజైన సోమవారం కూడా అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. జమ్ము-శ్రీనగర్ హైవే దెబ్బ తినడం, వర్షాలు కురుస్తుండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్ము మార్గం గూండా అమర్నాథ్ యాత్ర చేయడానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే మంచు శివ లింగం దర్శనం పూర్తి కాకుండా తాము వెనుదిరగమని పలువురు భక్తులు తెలిపారు. 10 రోజులైనా తాము శిబిరాల్లోనే వేచి చూస్తామని.. తాగునీరు వంటి సదుపాయాలు మెరుగు పరచాలని భక్తులు కోరారు.