సీఎం చెన్నీ ఏమైనా మాంత్రికుడా? అంటూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 20 నుంచి 30 స్థానాల కంటే మించి సీట్లు రావని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే సారి కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం చెన్నీ వ్యాఖ్యలకు కౌంటర్గా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు చరణ్జిత్ చెన్నీ ఎవరు? కేవలం మూడు నెలల్లోనే పంజాబ్లో చమత్కారం చేయగలరా? ఎన్నికల ముందు ఆయన్ను హీరోగా చూపించాలని అధిష్ఠానం ప్లాన్. అందుకే ఆయనకు క్రెడిట్ వచ్చింది. నా దృష్టిలో సీఎం చెన్నీ, సిద్దూ ఇద్దరూ వ్యర్థులే అంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా విమర్శించారు.