హిందూ దేవతలపై 2018 అభ్యంతరకర ట్వీట్ కేసులో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్కు బెయిల్ లభించింది. హిందూ దేవతపై చేసిన “అభ్యంతరకరమైన” ట్వీట్కు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల బెయిల్ బాండ్, ఆ మొత్తానికి ఒక పూచీకత్తుపై జుబేర్కు బెయిల్ మంజూరు చేశారు. అలాగే, ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది.
2014 తర్వాత మారుతూ వస్తున్న మత రాజకీయాల పరిస్థితిపై సూటి విమర్శ చేస్తూ అందుకు దృశ్యరూపకంగా ‘హానీమూన్ హోటల్’ ఫొటోను జుబేర్ 2018లో ట్వీట్ చేశారు. ఆ ఫొటో ద్వారా హనుమాన్ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ 2022 జూన్ 19న పోలీసులకు ‘హునుమాన్ భక్త్’ అనే యూజర్ ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జుబేర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 2న మెజిస్ట్రియల్ కోర్టు అతడి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కేసు స్వభావం, తీవ్రతను బట్టి విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని మెజిస్ట్రియల్ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.