గుజరాత్లోని గోగాసమర్ధిలోని గధాడా తాలూకా ఓ చరిత్ర సృష్టించింది. సర్పంచ్ మొదలు… పంచాయతీ మొత్తం మహిళా సభ్యులే ఉన్నారు. ఇలా ఉండాలని పార్టీలన్నీ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఇది గమనించాల్సిన అంశం. గ్రామానికి అవసరమైన పనులన్నీ చేస్తామని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భావం తర్వాత ఇలా ఓ గ్రామపంచాయతీ మొత్తం మహిళా సభ్యులతో నిండిపోవడం ఇదే ప్రథమం. అయితే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈ గ్రామం మొత్తం ఏకతాటిపై నిలబడుతుంది. అందరూ కలిసి నడుం కట్టడం ఇక్కడి ప్రత్యేకత. గ్రామానికి కావల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చుకున్నారు. ఏ పండగలు జరిగినా, అందరూ కలిసే జరుపుకుంటారు. పడాపన్ గ్రామంలోని గ్రామపంచాయతీలో అందరూ మహిళా సభ్యులే ఉంటూ రికార్డుల్లోకెక్కారు.
మహిళా సాధికారతకు ఘోగాసమండి పంచాయతీ ఓ అద్భుత ఉదాహరణగా నిలుస్తోందని సర్పంచ్ ప్రకటించారు. ఈ గ్రామం కోసం మహిళలందరూ కలిసి పనిచేస్తుంటారు. ప్రస్తుతానికి చాలా వాడల్లో సీసీ టీవీలు, మంచి నీటిసరఫరా పటిష్ఠంగా ఉంది. రాబోయే రోజుల్లో గ్రామమంతా చక్కటి రోడ్లను నిర్మిస్తామని సభ్యులు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఆస్పత్రి, పాఠశాల లేదని, కొన్ని రోజుల్లోనే వీటిని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ విషయంపై ప్రభుత్వానికి తాము ఓ ప్రతిపాదనను పంపుతున్నామని, అతి త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించారు.
తమ గ్రామంలో మంచి ఆస్పత్రి లేదని, అతి త్వరలోనే ఆస్పత్రిని నిర్మించి, ప్రజలకు అందిస్తామని ఘోగాసమండి సర్పంచ్ మధుబేన్ ప్రకటించారు. ఇది తమకు అత్యావశ్యకమని, ఇది పూర్తైతే ప్రజలు సుదూర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన దుస్థితి ఉండదన్నారు. ఇక గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, అతి త్వరలోనే ఆ పోస్టులను కూడా భర్తీ చేస్తామని, విద్యార్థులు చక్కటి విద్యనందిస్తామని సర్పంచ్ ప్రకటించారు.