న్యూఢిల్లీ, మార్చి 29: మైక్రోసాఫ్ట్కు చెందిన ఇంటర్నెట్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ ‘గిట్హబ్’.. భారత్లో 142 మంది ఇంజినీర్లపై వేటు వేసింది. ఆయా ఉద్యోగులకు రెండు నెలల జీతం కూడా ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఓపెన్సోర్స్ డెవలపర్ ప్లాట్ఫాం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది సభ్యులను చేరుకొన్న కొద్ది రోజులకే తాజా పరిణామం జరుగడం గమనార్హం. గిట్హబ్ భారత్లో కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. మన దేశంలో కోటి మంది డెవలపర్ల సంఖ్యను ఇప్పటికే దాటేసింది.