న్యూఢిల్లీ: బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి, కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 8లోగా అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం పార్లమెంటు వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ నోటీసులు జారీ కావడం గమనార్హం.
మహువా మొయిత్రాపై చర్యలు!
కేంద్రప్రభుత్వం చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ వేదికగా ఆరోపించారు. శుక్రవారం ఆమె లోక్సభలో మాట్లాడుతూ బీజేపీకి భవిష్యత్తుపై భయం ఉన్నదని, వర్తమానంపై నమ్మకం లేదని పేర్కొన్నారు. అందుకే చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తనకు కేటాయించిన సమయంలో మాట్లాడనివ్వడం లేదని స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ రమాదేవిపై విమర్శలు గుప్పించారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చారని ఆరోపిస్తూ మొయిత్రాపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.