లక్నో : హోళీ వేడుకల (Holi celebrations) సందర్భంగా రంగులు అద్దకుండా ఉండేందుకు యూపీలోని అలీఘఢ్ మసీదును టార్పాలిన్తో కప్పేశారు. శాంతిభద్రతల దృష్ట్యా మసీదును టార్పాలిన్ కవర్లతో కప్పేశామని అధికారులు వెల్లడించారు.
అలీఘఢ్లోని సున్నితమైన క్రాస్రోడ్లో మసీదు ఉన్నందున హోళీ వేడుకల్లో మసీదుకు ఎవరూ రంగులు పులమకుండా ఉండేందుకు అబ్దుల్ కరీం మసీదును సోమవారం రాత్రి టార్పాలిన్ కవర్లతో కప్పేశారు. అధికారుల సూచనలకు అనుగుణంగా మసీదులో ఈ ఏర్పాట్లు చేశామని, దీంతో మసీదుపైకి ఎవరూ రంగులు ఇతర వ్యర్ధాలను విసిరే అవకాశం ఉండదని మసీదు నిర్వహణ కమిటీకి చెందిన హాజి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు.