లక్నో : యూపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 27 వేల ఓట్లు తగ్గించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పార్టీ కార్యకర్తలకు టార్గెట్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి 27 వేల ఓట్లు పెంచితే అధికారం మనదే అవుతుంది. ఆ మేరకు బీజేపీ నుంచి ఆ 27వేల ఓట్లు మన పార్టీకి మళ్లించడమో లేదంటే.. అధికార పార్టీకి తగ్గించడమో చేయాలి. ఇందుకోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వారిని మన పార్టీతో అనుసంధానం చేయాలి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేశారని.. కేవలం 14 కేసుల్లోనే అరెస్టులు చేసి ఆ మహనీయుడిపై వివక్ష చూపిస్తున్నారంటూ అఖిలేశ్ మండిపడ్డారు.