నిషిన్ : డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియాడ్లో మరోసారి పసిడి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో సెమీ ఫైనల్స్లో షెఫాలీ వర్మ (49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్లతో 100 నాటౌట్) అజేయ శతక గర్జన చేయగా టీమిండియా 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించి ఫైనల్కు దూసుకెళ్లింది. షెఫాలీకి తోడు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (40), స్మృతి మంధాన (37) ధనాధన్ ఆటతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.
లక్ష్యఛేదనలో బంగ్లా 15.4 ఓవర్లకు 81 రన్స్కే కుప్పకూలింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/7), శ్రీచరణి (2/7) స్పిన్ మాయకు తోడు నందని శర్మ (3/25) తన పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. మరో సెమీస్లో శ్రీలంక.. పాకిస్థాన్ను ఓడించి ఫైనల్ చేరింది. మంగళ వారం ఇదే వేదికలో భారత్, శ్రీలంక ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
1 టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా మంధాన (4,788) సుజీ బేట్స్ (4,758) ను అధిగమించి ఈ ఫార్మాట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచింది.