బాలియా: ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓట్ల కోసం సమాజ్వాదీ నేత అఖిలేశ్ యాదవ్ మతం మారినా ఆశ్చర్యం లేదన్నారు. పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) సానుభూతి కూడా అఖిలేశ్కు ఉంటుందని విమర్శించారు. ఐఎస్ఐ నుంచి అఖిలేశ్ ఆర్థిక సాయం కూడా పొందే అవకాశాలు ఉన్నట్లు ఆరోపించారు. ఇస్లామిక్ ప్రపంచానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ ఛాలెంజ్గా మారారని, పాక్ ఐఎస్ఐ నుంచి సలహాలు, సూచనలు అఖిలేశ్కు అందుతున్నాయని, ఎస్పీ నేతకు ఆర్థిక సాయం అందినా ఆశ్చర్యం లేదన్నారు. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు అఖిలేశ్ నమాజ్ చేశారని, రోజా కూడా ఉన్నట్లు శుక్లా ఆరోపించారు. గాంధీ, జిన్నా, పటేల్, నెహ్రాలూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చినట్లు అఖిలేశ్ అన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతోంది. అయితే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అఖిలేశ్ యాదవ్ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.