న్యూఢిల్లీ : లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. లోక్సభ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేస్తూ.. వెల్లోకి వెళ్లి నిరసన తెలపాలని కాంగ్రెస్ ఎంపీలను కోరారు. అదే సమయంలో అఖిలేశ్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయడంతో మాట్లాడలేదు. తనను కావాలనే మాట్లాడనివ్వలేదని అఖిలేశ్ ఆరోపించగా.. అదేమీ నిజం కాదని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ‘మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు’ అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.