న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్ ట్రేడర్ రాకేష్ ఝున్జున్వాకు చెందిన ఆకాశ ఎయిర్ (Akasa Air) ముంబై-అహ్మదాబాద్ రూట్లో కమర్షియల్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆకాశ ఎయిర్కు చెందిన తొలి విమాన సర్వీసుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి మంత్రి జ్యోతిరాదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశ ఎయిర్.. అత్యంత ఎత్తుకు ఎదగాలని, ఆకాశాన్ని ఏలాలని ఆకాంక్షించారు.
తక్కువ ధరలో విమానయాన సేవలు అందించే ఆకాశ ఎయిర్.. నేటి నుంచి ముంబై-అహ్మదాబాద్ మధ్య సర్వీలను అందిస్తున్నది. రెండు నగరాల మధ్య 28 వీక్లీ ఫ్లైట్స్ సేవలను అందించనున్నాయి. ఈ నెల 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య 28 వీక్లీ సర్వీసలను ప్రారంభించనుంది. వీటికి సంబంధించిన టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది.
HMCA Shri @JM_Scindia, HMoSCA Shri @Gen_VKSingh, Shri Rajiv Bansal, Secretary-MoCA, Smt. @ushapadhee1996, JS-MoCA, Smt. Neelu Khatri, Co-founder & Sr.VP corporate affairs, flagged off the first flight of @AkasaAir from @CSMIA_Official to @ahmairport.#AkasaAir pic.twitter.com/5XjPU4rBtZ
— MoCA_GoI (@MoCA_GoI) August 7, 2022
షెడ్యూల్లో భాగంగా అకాశ ఎయిర్ ముంబై- అహ్మదాబాద్ డైలీ ఫ్లైట్.. ఉదయం 10.05 గంటలకు ముంబై నుంచి బయల్దేరుతుంది. బుధవారం మినహా ప్రతి రోజు ఈ రూట్ ఫ్లైట్ ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి రిటర్న్ ఫ్లైట్ 12.05 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై నుంచి విమాన టికెట్ల ధర రూ. 4,314 నుంచి ప్రారంభం కాగా, అహ్మదాబాద్ నుంచి వచ్చేవారికి టికెట్ ప్రారంభ ధర రూ. 3,906గా ఉంది.