Ajit Pawar: నరేంద్రమోదీయే మూడోసారి కూడా ప్రధాని కావాలని దేశంలోని 65 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారు మోదీని మళ్లీ పీఎం చేసే దిశగా పనిచేస్తోందని ఆయన అన్నారు.
అజిత్ పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ సభలో అజిత్ పవార్ ప్రసంగించారు. మీరంతా ఎల్లవేళలా నన్ను ఆశీర్వదిస్తున్నారని, మీ ఆశీర్వాదాలతోనే నేను ఇప్పుడు మీ ముందు ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. మీ సాయంతోనే పుణె జిల్లాకు ఇన్చార్జి మంత్రిని అయ్యానని చెప్పారు.
దేశంలో 65 శాతానికి పైగా జనం నరేంద్రమోదీయే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అజిత్పవార్ చెప్పారు. రాష్ట్రంలోని సంకీర్ణ సర్కారు.. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని 400కు పైగా స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. ఎన్డీఏ గెలుపు కోసం అందరూ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.