న్యూఢిల్లీ : రక్షణశాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పర్యాటక శాక సహాయ మంత్రిగా కూడా ఆయన ఇవాళే బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాముఖ్యాత అంశాలను ఫిక్స్ చేశామని, మన దేశానికి లక్షలాది సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారని, ఆ అంశాలను అధ్యయనం చేసిన తర్వాత, ఆ రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. టూరిజం రంగం నిత్యం విస్తరిస్తోందని మంత్రి అజయ్ భట్ తెలిపారు.