దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ కేసుల తీవ్రత, తదితర అంశాలపై చర్చించినట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కేసుల తీవ్రత దృష్ట్యా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతుల కల్పన విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరిస్థితిపై చర్చించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సమాయత్తంపై కూడా చర్చించారు. అని కేంద్ర హోంశాఖ తన ప్రకటనలో పేర్కొంది.