నైపిడావ్: మయన్మార్లో సైన్యం దాష్టీకానికి దిగింది. ఆర్మీ పరిపాలనను వ్యతిరేకిస్తున్న వారిపై వైమానిక దాడి చేసింది. సగైగ్ ప్రాంతంలోని పజిగ్యి గ్రామంలో మంగళవారం ప్రజలు సైనిక వ్యతిరేక కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సమయంలో వాయుసేన బాంబులు వేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మృతి చెందినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారని వెల్లడించింది. సైనిక పాలనలో ఇప్పటివరకు మూడు వేల మంది పౌరులను సైన్యం చంపిందని అంచనా.