న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి భారత్కు చేరుకున్నారు. ఈజిప్టు ఎయిర్లైన్స్కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన దేశ రాజధాని ఢిల్లీలో దిగారు. భారత ప్రతినిధి బృందం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది.
పర్యటనలో భాగంగా అబ్దెల్ ఫతాహ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, భారత గణతంత్ర వేడుకలకు విదేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో ఎవరూ రాలేదు.
Egyptian President Abdel Fattah El –Sisi arrives in Delhi. He will attend the #RepublicDayParade as the Chief Guest.
During his visit, he will also meet President Droupadi Murmu, Prime Minister Narendra Modi and EAM Dr S Jaishankar. pic.twitter.com/C57hz0Jxls
— ANI (@ANI) January 24, 2023