చండీగఢ్: వస్ర్తాల తయారీలో నీటి వినియోగాన్ని 90 శాతం తగ్గించే ఎయిర్ నానో బబుల్ టెక్నాలజీని ఐఐటీ రోపర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాధారణంగా కిలో కాటన్ వస్త్రం తయారీకి 200-250 లీటర్ల నీరు అవసరం అవుతుంది. వినియోగించిన ఆ నీరు కూడా రసాయనాలతో కలుషితం అవుతుంది. నీటి పొదుపును దృష్టిలో ఉంచుకొని ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామని ఐఐటీ రోపర్ డైరెక్టర్ రాజీవ్ అహుజా తెలిపారు. నీటి కంటే ప్రభావవంతంగా ఇది పనిచేస్తుందన్నారు. ఒక్కో బబుల్ పరిమాణం 1/10,000 వంతు ఉంటుందని పేర్కొన్నారు.