న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కొత్త బాస్కు వెస్టర్న్ ఎయిర్ కమాండ్ గౌరవ వందనం సమర్పించింది. పంకజ్ మోహన్ భారత వాయుసేనకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన భారత ప్రభుత్వం నుంచి విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం అందుకున్నారు.
పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పంకజ్ మోహన్ సిన్హా.. 1985లో ఫైటర్ పైలట్గా భారత వాయుసేనలో చేరారు. ఈయనకు 4,500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో గత 37 ఏండ్లుగా పంకజ్ మోహన్కు వివిధ హోదాల్లో సేవలు అందించారు.
వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్, ఎయిర్ మార్షల్ ఎస్ ప్రభాకరన్ 2022, డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్గా ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా బాధ్యతలు తీసుకున్నారు.
Air Marshal Pankaj Mohan Sinha assumes command of the Indian Air Force’s Western Air Command.
He is a recipient of the ‘Vishist Seva Medal’ and the ‘Ati Vishist Seva Medal’. pic.twitter.com/bs8aIGxcJv
— ANI (@ANI) January 1, 2023