న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతీయ దళాలు 13 పాకిస్థానీ విమానాలను ధ్వంసం చేసి 11 వైమానిక కేంద్రాలపై దాడులు చేశాయని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను అందరికీ అందుబాటులోనే ఉన్నాయని భారత వైమానికదళ ఉన్నతాధికారి ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భారతీ గురువారం తెలిపారు. భారత వైమానిక దళం, నౌకాదళం, సైన్యానికి చెందిన సైనిక కార్యకలాపాల అధిపతులు జైపూర్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు.
ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం సందర్భంగా ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ గత ఏడాది మే 7న తాము పాక్కు చెందిన 9 ఉగ్ర శిబిరాలపై దాడులు చేసి నేలమట్టం చేశామని చెప్పారు. లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ అంతం కాదని, అది ఆరంభం మాత్రమేనని అన్నారు.