Air India | న్యూఢిల్లీ, మే 2: డొమెస్టిక్ ప్రయాణికుల లగేజీ అనుమతిలో కోత విధిస్తూ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. గతంలో ఎకనామీ కంఫర్ట్ ప్రయాణికులకు 20 కేజీల లగేజీతో ప్రయాణించేందుకు అనుమతి ఉండగా ఇప్పుడు 15 కిలోలకు తగ్గించింది. ఎకనామీ కంఫర్ట్ ప్లస్ క్లాస్ ప్రయాణికులకు ఇంతకుముందు 25 కిలోలకు అనుమతి ఉండగా ఇప్పుడు 15 కిలోలకు తగ్గించింది.
బిజినెస్ కంఫర్ట్ ప్లస్ ప్రయాణికులకు గతంలో 35 కిలోల వరకు లగేజీతో ప్రయాణం చేసే వీలుండేది. ఇప్పుడు 25 కిలోలకు పరిమితి విధించింది. బిజినెస్ ఫ్లెక్స్ ప్రయాణికులకు ఇంతకుముందు 40 కేజీల లగేజీకి అనుమతి ఉండేది. ఇప్పుడు 35 కేజీలకు తగ్గించింది. ఈ నిర్ణయం మే 2 నుంచి అమలులోకి వస్తుందని ఎయిర్ ఇండియా పేర్కొన్నది.