న్యూఢిల్లీ: ఫైటర్ పైలెట్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఇవాళ ఐఏఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో లడాఖ్ వద్ద ఇంచార్జీగా వ్యవహరించారు. ఎయిర్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఇవాళ రిటైర్ అయ్యారు. భదౌరియా 42 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నారు. 36 రాఫెళ్లు, 83 మార్క్ 1ఏ తేజస్ విమానాల కొనుగోళ్ల విషయంలో భదౌరియా కీలక పాత్ర పోషించారు. అయితే వీఆర్ చౌదరి వైమానికదళంలో ఎన్నో కీలక హోదాల్లో పనిచేశారు. కదనరంగంతో పాటు హెడ్క్వార్టర్స్లో ఆయన విధులు నిర్వర్తించారు. వైమానిక రక్షణ వ్యవస్థల ఆధునీకరణలో చౌదరీ ముఖ్య పాత్ర పోషించనున్నారు. త్వరలో ఇండియా ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్లను రష్యా నుంచి తీసుకురానున్నది. యుద్ధ విమానాల ఆధునీకరణలోనూ చౌదరీ బాధ్యత తీసుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కుమారుడు కూడా యుద్ధ విమాన పైలెట్. ఆయన రాఫెల్ యుద్ధ విమానాన్ని నడుపుతాడు.
1982లో చౌదరీ ఐఏఎఫ్లో చేరారు. 3800 గంటల పాటు ఫ్లయింగ్ అనుభవం ఉన్నది. ఫైటర్, శిక్షణ విమానాలను నడిపారు. ఆపరేసన్ మేఘదూత్లో పాల్గొన్నారు. 1980 దశకంలో సియాచిన్ గ్లేసియర్ను ఆక్రమించే సమయంలో ఆపరేషన్ మేఘదూత్ చేపట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సఫేద్ సాగర్లోనూ పాల్గొన్నారు.