చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ఘటనా ప్రాంతానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి బయలుదేరారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ సులూర్ ఎయిర్ బేస్ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు.కాగా ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఇక ఈ ఘటనపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం ఘటనా ప్రాంతాన్ని సందర్శిస్తారు.