పెద్దన మనుచరిత్రలో మారన పేర్కొన్న ప్రవరుడు అనే పేరునే తీసుకొని ఆ పాత్రకు గొప్ప ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాడు. మారన కవితా ప్రభావం పెద్దన పద్యభావాల్లో కనిపిస్తుంది. ఈ విధంగా తర్వాత మహాకవులకు ప్రేరణను ఇచ్చిన కవిత్వాన్ని మారన రచించాడు. మారన ఈ పురాణాన్ని 13వ శతాబ్దం వాడైన నాగయ గన్ననికి అంకితంగా ఇచ్చాడు. ఈ గన్నయ- గోన గన్నారెడ్డియే అని కొందరు పండితుల అభిప్రాయం. రచించింది ‘పురాణం’ అయినా చాలా వృత్తాంతాలు కల్గినటువంటి మారన ‘మార్కండేయ పురాణం’ శైలి చాలా రమ్యంగా సాగింది.
‘రంగనాథ రామాయణం’ రచించిన గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక (క్రీ.శ. 1230-1300) కాకతీయుల సామంతులైన మర్యాల వారి కోడలు. బూదపురం శాసనం వేయించింది ఆమెనే. అయ్యలరాజు రామభద్రుడు తన పద్య సంకలనం గ్రంథంలో నాయిక విరహవేదనతో కూడిన కుప్పాంబిక రచించిన పద్యాన్ని ఉదహరించాడు. విరహవేదనతో కూడిన ఈ పద్యం కుప్పాంబిక రచించిన ఏదో కావ్యంలోనిది అయి ఉంటుంది. దీన్నిబట్టి కుప్పాంబిక కావ్య రచయిత్రి అని చెప్పవచ్చు. లభించిన ఒక్క పద్యం ద్వారానే ఆమె మంచి కవిత్వం చెప్పగల కవయిత్రి అని తెలుస్తున్నది. ఆమె తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవయిత్రిగా పరిగణింపబడుతున్నది. కానీ, క్రీ.శ. 1000లో గూడూరు శాసనాన్ని వేయించిన విరియాల కామసాని రాజకీయ దురంధర పరిపాలనా ధక్షురాలు. ఆమె ఆ శాసనంలోని పద్యాలను రచించిందీ అనుకుంటే.. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవయిత్రి విరియాల కామసాని అవుతుంది.
రెండవ ప్రతాపరుద్రుని కాలం వాడే రావిపాటి త్రిపురాంతకుడు. ఆయన ‘త్రిపురాంతకోదాహరణం’ అనే ఉదాహరణ కావ్యాన్ని రచించాడు. ఈ కవి సంస్కృతంలో ‘ప్రేమాభిరామం’ అనే గ్రంథాన్ని రచించాడు. అదే ‘క్రీడాభిరామం’గా తెలుగులోకి అనువదించబడింది. క్రీడాభిరామంలో ఆనాటి ఏకశిలా నగరం అంటే ఈనాటి ఓరుగల్లు వీధులు ఎలా ఉండేవి, ప్రజా జీవనం ఏ విధంగా ఉండేది మొదలైనవి కళ్లకు కట్టినట్లుగా కన్పిస్తాయి.
ప్రేమాభిరామం అలభ్యం. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయని అనువాద రచనగా లభిస్తున్నది. ఆనాటి ఏకశిలా నగర స్వరూపాన్ని, వైభవాన్ని తెలుసుకోవటానికి ఈ గ్రంథం ఉపకరిస్తున్నది.
వీరశైవ సాహిత్యోద్యమం
వీరశైవ మతం క్రీ.శ. 12వ శతాబ్దంలో కన్నడ దేశంలో ఆవిర్భవించింది. కళ్యాణీ చాళుక్యుల చివరిరాజును కలచురి బిజ్జలుడు చంపి కళ్యాణి సింహాసనాన్ని అధిష్టించాడు. అతని దగ్గర దండనాయకుడిగా బసవేశ్వరుడు ఉన్నాడు.
గణపతి దేవుని కాలంలో ఓరుగల్లును సందర్శించిన తిక్కన సోమయాజి అనుగ్రహం వల్లనే కవిత్వం చెప్పగలిగానని మారన ఆశ్వాసాంత గద్యంలో చెప్పాడు. దీన్నిబట్టి మారన తిక్కన అభిమాని అని, అతని సందర్శనం మహత్యం చేతనే కవిత్వం చెప్పగలిగానని చెప్పుకున్నాడు. మారన సంస్కృతంలోని ‘మార్కండేయ పురాణా’న్ని అనువదించాడు. అష్టాదశ పురాణాలన్నిటిలోకి ఇది తెలుగులో అనువదితమై మొదటి పురాణం. ఈ పురాణంలోని హరిశ్చంద్ర, వరూధిని-ప్రవరుల కథ, మదాలస- కుబలయాశ్రుల కథలను తీసుకొని తర్వాత కవులు కావ్యాలుగా రచించారు. పెద్దన ‘మనుచరిత్ర’లో మారన భావాలను పద్యాలను తీసుకొని రచించాడు. మారన ‘అతి సుకుమార మూర్తి ప్రవరాఖ్యుడు’ (4- 214)అని సంస్కృత మూలంలో పేరులేని నాయకునికి ‘ప్రవరాఖ్యుడు’ అని నామకరణం చేశాడు.
తెలంగాణ
సాహిత్య ప్రస్థానం-11
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606