చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే కో-ఆర్డినేటర్ ఓ. పన్నీరుసెల్వం సతీమణి పీ విజయలక్ష్మీ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు 63 ఏళ్లు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మీకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. థేనీ పార్లమెంట్ సభ్యులు పీ రవీంద్రనాథ్ అందులో ఒకరు. రెండు వారాల పాటు ఉదర వ్యాధి చికిత్స పొందిన విజయలక్ష్మి ఇవాళ ఉదయం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. కానీ ఆమె ఉదయం 8 గంటలకు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి, జలవనరుల శాక మంత్రి దురైమురుగన్, ఇతర నేతలు విజయలక్ష్మి మృతి పట్ల సంతాపం తెలిపారు. పన్నీరుసెల్వం స్వంత పట్టణం పెరియాకులమ్లో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.