లక్నో: సాధారణ కాన్పు ద్వారా జన్మించిన నవజాత శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. ఆక్సిజన్ వ్యవస్థకు కూడా స్పందించలేదు. శరీరంలో కదలిక లేకపోవడంతో చివరకు మహిళా డాక్టర్ తన నోటి ద్వారా సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడింది. దీంతో ఆ శిశువులో చలనం వచ్చింది. పసి పాప ఏడ్వటం చూసి తన ప్రయత్నం ఫలించినందుకు ఆ డాక్టర్ సంతోషించింది. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది మార్చిలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. సాధారణ కాన్పు వల్ల పుట్టిన ఆ శిశువు శ్వాస తీసుకోలేకపోయింది. ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయింది. శరీరంలో కదలిక కూడా లేదు.
కాగా, డాక్టర్ సులేఖా చౌదరి వెంటనే స్పందించారు. నవజాత శిశువుకు కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేశారు. సుమారు ఏడు నిమిషాల పాటు నోటి ద్వారా శ్వాస అందించారు. దీంతో ఆ పసి పాపలో చలనం వచ్చింది. ఒక్కసారిగా ఏడ్చింది. తన ప్రయత్నం ఫలించినందుకు ఆ డాక్టర్ సంతోషించింది.
మరోవైపు యూపీ పోలీస్ అధికారి సచిన్ కౌశిక్ ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడే పుట్టిన ఆ పసి పాపను సీపీఆర్ ద్వారా బతికించిన ఆ డాక్టర్కు నెటిజన్లు సెల్యూట్ చేశారు. వృత్తి పట్ల అంకిత భావం, ఆమె ప్రయత్నాన్ని అభినందించారు.
ये घटना/विडीओ मार्च 2022, एत्मादपुर, आगरा की है।
VC- Whatsapp pic.twitter.com/luWXsGZcIO— SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022