న్యూఢిల్లీ: ఆర్మీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అగ్నివీర్కు ఆర్మీ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అగ్నివీరుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఈ ఘటనే నిదర్శనమని విపక్షాలు తప్పుపట్టాయి. తుపాకీతో కాల్చుకొన్న గాయం వల్ల చనిపోయాడనే కారణంతో ఆర్మీ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆర్మీ పేర్కొనడంపై పలువురు మండిపడుతున్నారు.
పంజాబ్కు చెందిన అమృత్పాల్ సింగ్(19) అనుమానాస్పదంగా తుపాకీ పేలి తలకు గాయమవడంతో చనిపోయాడు. జమ్ము కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఈనెల 10న ఈ విషాదం చోటుచేసుకొంది. ఈ నెల 13న స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు నిర్వహించగా.. ఆర్మీ లాంఛనాల ప్రకారం చేయలేదు.