న్యూఢిల్లీ, జూలై 4: త్రివిధ దళాల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వివాదాస్పద అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వచ్చేవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. లక్షల మంది యువత జీవితాలు అగ్నిపథ్తో చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉన్నందున తన పిటిషన్పై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. అయితే, ఈ అంశంపై చాలా పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిని కోర్టు వేసవి సెలవుల తర్వాత తగిన బెంచ్కు బదిలీ చేస్తామని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన సెలవుకాల ధర్మాసనం సోమవారం తెలిపింది.