అమృత్సర్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశంలో ఉధృతంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆర్మీ ఉద్యోగార్థులు భారీగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. అయితే పంజాబ్లో మాత్రం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) సంగ్రూర్ ఉపఎన్నికల్లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కారు రూఫ్టాప్ నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నిల్చున్న ఓ యువకుడు అగ్నిపథ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాడు. అతడిని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తన కాన్వాయ్ ఆపారు.
సీఎం దగ్గరకు వెళ్లిన ఆ యువకుడు ‘అగ్నిపథ్ను అమలు చేయడానికంటే ముందే.. అందరు నాయకులు దానిగుర్చించి చర్చించండి’ అని కోరాడు. దీంతో అగ్నిపథ్పై ఎంపీలు ఒకవైళ సమావేశం నిర్వహిస్తే తానే స్వయంగా వెళ్తానని సీఎం అతడికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తన కాన్వాయ్లో ముందుకు కదిలారు. అందుకే సీఎం మాన్ను ప్రజలు ఇష్టపడుతారని పేర్కొంటూ.. ఈ వీడియో ఆమ్ఆద్మీ పార్టీ షేర్ చేసింది.
The reason why Punjab loves @BhagwantMann ❤️
Punjab CM STOPPED his roadshow for #SangrurBypoll to listen to a youth protesting against #AgnipathScheme pic.twitter.com/PVXiTU0MYI
— AAP (@AamAadmiParty) June 19, 2022