సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమాజ్వాదీ మార్గదర్శకుడు ములాయం యాదవ్తో భేటీ అయ్యారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. యూపీ ఎన్నికలు వెల్లడైన తర్వాత ములాయంతో అఖిలేశ్ భేటీ కావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ను ములాయం మెచ్చుకున్నారు. ‘బహుత్ అచ్ఛా లడే తుమ్. బహుత్ బహుత్ బధాయీ’ (అద్భుతంగా పోరాటం చేశావ్.. అనేకానేక శుభాకాంక్షలు) అంటూ ములాయం సింగ్ అఖిలేశ్ను మెచ్చుకున్నారు.
తాజాగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లకు గాను బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది. ఇక అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీకి 125 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు నూతనంగా ఎన్నికైన సమాజ్వాదీ ఎమ్మెల్యేలతో అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ నెల 21 న సమావేశం కానున్నారు.