Fadnavis |శివసేన నేత ఏక్నాథ్ షిండేను మహారాష్ట్ర సీఎంగా తానే ప్రతిపాదించానని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇంతకుముందు రెండు దఫాలు సీఎంగా పని చేసిన ఫడ్నవీస్.. ఇటీవలి శివసేన తిరుగుబాటు తర్వాత మూడో దఫా సీఎం అవుతారని అంతా భావించారు. అనూహ్యంగా గురువారం ఉదయం ప్రభుత్వానికి దూరంగా ఉంటానని ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవీస్.. సాయంత్రానికి ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ విషయమై ఫడ్నవీస్ అసంతృప్తితో ఉన్నారని వార్తలు రావడంతో మంగళవారం నాగ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వివరణ ఇచ్చారు.
ఒకవేళ నేను బీజేపీ నాయకత్వం ముందు షిండేను సీఎంగా చేయాలని నేను ప్రతిపాదించా. వారు ఆమోదించారు. ఇదేమీ తప్పు కాదు` అని ఫడ్నవీస్ చెప్పారు. `మా నాయకులు నరేంద్రమోదీ జీ, అమిత్షా జీ, జేపీ నడ్డాజీ నా అభిప్రాయాన్ని ఆమోదించారు` అని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.