న్యూఢిల్లీ: తల్లిదండ్రుల మరణం గురించి తెలియడంతో ఆ బాధతో ఒక వ్యక్తి బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నైజీరియా (Nigerian Man) దేశానికి చెందిన 37 ఏళ్ల డినోజువో, ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని ఒక భవనంలో నివసిస్తున్నాడు. నైజీరియాలో ఉన్న అతడి తల్లిదండ్రులు మరణించిన సంగతి తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అతడు వింతగా ప్రవర్తించాడు. బిల్డింగ్ రెండో అంతస్తు బాల్కానీ రెయిలింగ్ను పట్టుకుని ప్రమాదకరంగా వేలాడాడు. గట్టిగా మాట్లాడుతూ, అరుస్తూ పిచ్చిపట్టిన వ్యక్తి మాదిరిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ భవనం రెండో అంతస్తుపై నుంచి కిందకు దూకాడు.
కాగా, గమనించిన ఒక వ్యక్తి పరుగున ఆ నైజీరియా వ్యక్తి వద్దకు వెళ్లాడు. సహాయం చేసేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అతడ్ని విడిపించేందుకు స్థానికులు కర్రలతో నైజీరియా వ్యక్తిపై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు. బిల్డింగ్పై నుంచి దూకడంతో కాలు విరిగి గాయపడిన డినోజువోను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నైజీరియాలోని తన తల్లిదండ్రులు చనిపోయిన విషాద వార్త తెలుసుకున్న తాను షాక్కు గురయ్యానని పోలీసులకు తెలిపాడు. ఆ డిప్రెషన్లో ఉన్న తాను అలా ప్రవర్తించినట్లు చెప్పాడు.
మరోవైపు నైజీరియా వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకుతుండటాన్ని కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
दिल्ली के निहाल विहार इलाके में नाइजीरिया का नागरिक का घर में दूसरी मंजिल से कूदते हुए वीडियो,पुलिस के मुताबिक जब उसे पता चला कि उसके माता पिता की मौत नाइजीरिया में हो गई है,इसके बाद वो सदमे में चला गया और डिप्रेशन में आकर वो दूसरी मंजिल से कूद गया pic.twitter.com/yvAs4RRWGI
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) March 26, 2023