పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి (Misa Bharti) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రోలర్ బాండ్లు పెద్ద కుంభకోణమని ఇటీవల ఆరోపించారు. ‘ఇండియా’ బ్లాక్ కూటమి అధికారంలోకి వస్తే ఈ అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళ్తారని అన్నారు. ఈ నేపథ్యంలో మిసా భారతి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆమెకు ఆ పేరు ఎందుకు పెట్టరో అన్నది ఆలోచించుకోవాలని విమర్శిచింది.
కాగా, ‘మిసా’ (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) కింద లాలూ ప్రసాద్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ జైలులో పెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తెలిపారు. ఈ చట్టం ప్రకారం కోర్టును ఆశ్రయించడం, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చని చెప్పారు. ‘శాశ్వత జైలుకు సంబంధించిన నిబంధన ఇది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆ సమయంలో కాంగ్రెస్ను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అందుకే తన కుమార్తెకు ‘మిసా’ అని పేరు పెట్టారు. తండ్రి ప్రమాణాన్ని మిసా ఎగతాళి చేస్తున్నారా? అలా అయితే ఆమె తన పేరు మార్చుకోవాలి’ అని బీజేపీ నేత సుధాన్షు త్రివేది అన్నారు.