న్యూఢిల్లీ, జూన్ 7: ఒక దళిత బాలుడు క్రికెట్ బాల్ను పట్టుకున్నాడన్న కోపంతో కొందరు అగ్ర కులస్తులు బాలుడి మేనమామపై దాడి చేసి అతడి బొటన వేలును దారుణంగా నరికిన సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పఠాన్ జిల్లాలో కాకోషి గ్రామంలో ఈనెల 4న సంఘటన జరిగింది. గ్రామంలోని ఒక స్కూల్ అటస్థలంలో కొందరు క్రికెట్ అడుతుండగా బాల్ దూరంగా వెళ్లడంతో దానిని ఎనిమిది ఏండ్ల బాలుడు పట్టుకున్నాడు.
ఈ చర్యతో కుల్దీప్ సింగ్ రాజ్పుత్, మరికొందరు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరగడంతో బాలుడి బంధువులు ధీరజ్ పర్మార్, కీర్తి వచ్చి సర్ది చెప్పారు. తర్వాత కీర్తి టీ స్టాల్ వద్ద ఉండగా కుల్దీస్ సింగ్ రాజ్పుత్ మరికొందరు కత్తులు, కర్రలతో దాడి చేశారు. అతని ఎడమచేతి బొటనవేలు నరకడమే కాక, కుడిచేతి చిటికెన వేలును గాయపర్చారు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి మిగతా వారి కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ విశాల్ దబ్రల్ తెలిపారు.