ముంబై: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రోహిత్ శర్మ వికెట్ పడగొట్టిన తర్వాత మహారాష్ట్రలోని మాల్వాన్లో స్క్రాప్ షాప్ యజమాని ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు ఇది దారి తీసింది. (Bulldozer Action) స్థానికులు వారిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
కాగా, మాల్వాన్ మున్సిపల్ అధికారులు కూడా సోమవారం స్పందించారు. బుల్డోజర్ చర్యలు చేపట్టారు. ఆ స్క్రాప్ షాప్ను నేలమట్టం చేశారు. శివసేనకు చెందిన నీలేష్ రాణే ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఒక చర్యగా, మేం ఖచ్చితంగా ఈ బయటి వ్యక్తిని జిల్లా నుంచి బహిష్కరిస్తాం. కానీ దానికి ముందు, అతడి స్క్రాప్ వ్యాపారాన్ని వెంటనే నాశనం చేశాం. సత్వర చర్యలు తీసుకున్నందుకు మాల్వాన్ మున్సిపల్ కౌన్సిల్, పోలీస్ అధికారులకు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు. వలస ముస్లిం వ్యక్తికి చెందిన స్క్రాప్ షాప్ను బుల్డోజర్తో ధ్వంసం చేసిన వీడియో క్లిప్ను షేర్ చేశారు.
मालवणात एक मुसलमान परप्रांतीय भंगार व्यवसायिक यानी काल भारत पाकिस्तान मॅच नंतर भारत विरोधी घोषणा दिल्या.
कारवाई म्हणून आम्ही या परप्रांतीय हरामखोराला जिल्ह्यातून हाकलून देणारच पण त्या अगोदर तात्काळ त्याचा भंगार व्यवसाय उध्वस्त करून टाकला.
मालवण नगर परिषद प्रशासन आणि पोलीस… pic.twitter.com/LK1yDPuLa6— Nilesh N Rane (@meNeeleshNRane) February 24, 2025
A bike rally was taken out by Peacefools in Malvan with “ Pakistan Zindabad “. slogans after Rohit Sharma ‘s dismissal
The person who took the lead has been identified & his ILLEGAL Shop has been demolished by Devendra Fadnavis govt
BULLDOZER action on anti Nationalist 🔥🔥 pic.twitter.com/1tyPhaeJwE
— Viक़as (@VlKAS_PR0NAM0) February 24, 2025