శ్రీనగర్, సెప్టెంబర్ 18: జమ్ముకశ్మీర్లో మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకొన్నాయి. ఉగ్రవాద భయంతో కశ్మీర్ లోయలో 32 ఏండ్ల కిందట థియేటర్లు మూతపడగా, ఆదివారం లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో రెండు సినిమా హాళ్లను ప్రారంభించారు. త్వరలోనే ప్రతి జిల్లాకో థియేటర్ నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.