తిరువనంతపురం, నవంబర్ 25: సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్ పాయింట్(ఎల్1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగించి 60 ఏండ్లు అయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఎల్1 పాయింట్లోకి ప్రవేశించేందుకు అవసరమైన చివరి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పారు.