(స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, 22 మార్చి (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని విరుదునగర్ లోక్సభ స్థానానికి ఆసక్తికర పోటీ నెలకొంది. అక్కడి నుంచి బీజేపీ తరపున నటి రాధిక శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెపై సినీ రంగానికే చెందిన వ్యక్తిని బరిలో దింపాలని అన్నాడీఎంకే, డీఎండీకే కూటమి నిర్ణయించింది.
అన్నాడీఎంకే ఎన్నికల పొత్తులో భాగంగా ఆ సీటును డీఎండీకే పార్టీకి కేటాయించింది. డీఎండీకే తరపున ఆ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత విజయ్కాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ పోటీ చేయనున్నట్టు పార్టీ ప్రకటించింది.