చండీగఢ్, జనవరి 7: పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా ప్రముఖ నటుడు సోనూసూద్ నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4న నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ కరుణరాజు శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి పోటీచేస్తుందని సోనూసూద్ గత నవంబర్లో ప్రకటించిన నేపథ్యంలో ఈసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరించిన సోనూసూద్, అటువంటి ప్రణాళికలేవీ లేవని చెప్పారు.