బెంగళూర్ : కన్నడ నాట ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్కు చేరింది. ప్రధాన పార్టీల తరపున అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు (Karnataka Assembly Elections )సుడిగాలి ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్ కుమారుడు, నటుడు శివ రాజ్కుమార్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తళుక్కుమన్నారు. చిత్రదుర్గలో మంగళవారం కాంగ్రెస్ ర్యాలీలో శివ రాజ్కుమార్ పాల్గొన్నారు.
తాను రాహుల్ గాంధీ అభిమానిగా ఈరోజు ఇక్కడకి వచ్చానని చెప్పారు. రాహుల్ ఇటీవల భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని, ఈ యాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. శివ రాజ్కుమార్ భార్య గీత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్లకు దీటుగా సీట్లు, ఓట్లు సాధించి కింగ్మేకర్గా ఎదిగేందుకు జేడీఎస్ సన్నద్ధమైంది. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More