Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్లో అడిగిన ఒక ప్రశ్న వైరల్ అవుతున్నది. పారిశ్రామిక వేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను షేర్ చేసిన ప్రకాశ్రాజ్.. ఇక్కడ కామన్ ఏమిటి? అని నెటిజన్లను ప్రశ్నించారు. ఈ ముగ్గురి పేరు తోక మోదీ అని కొందరు, ముగ్గురూ దొంగలే అని ఇంకొందరు, ఈ ముగ్గురూ దేశాన్ని దోచుకుంటున్నారని మరికొందరు కామెంట్లు చేశారు.