Pankaj Tripathi : ఎన్నికల కమిషన్ నేషనల్ ఐకాన్గా నియమితులైన నటుడు పంకజ్ త్రిపాఠి ఆ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తన రాబోయే సినిమాలో రాజకీయ నేతగా నటిస్తుండటంతో పంకజ్ త్రిపాఠి ఈసీ నేషనల్ ఐకాన్గా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా స్వచ్ఛందంగా వైదొలిగారని ఈసీఐ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
2022 అక్టోబర్ నుంచి ఓటర్లలో అవగాహన పెంచేందుకు త్రిపాఠి ప్రభావవంతంగా పనిచేసినందుకు ఈసీ కృతజ్ఞతలు తెలిపింది. 2022 అక్టోబర్లో పంకజ్ త్రిపాఠిని ఈసీ నేషనల్ ఐకాన్గా నియమించింది. త్రిపాఠి ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీ మై అటల్ హూ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిపాఠి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పాయ్ బయోపిక్లో టైటిల్ రోల్లో కనిపించనున్నారు.
ఇక త్వరలో తాను రాజకీయాల్లో అడుగుపెడతానని త్రిపాఠి పేర్కొన్నారు. బిహార్లో అందరూ రాజకీయ నేతలేనని, కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో పనిచేసినప్పుడు తాను అప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించలేదని అన్నారు. రవి జాదవ్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన మై అటల్ హూ మూవీ ఈనెల 19న విడుదల కానుంది. అటల్ బిహారి వాజ్పేయి కధను వెండితెరపైకి తీసుకురావడం తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నామని త్రిపాఠి చెప్పారు.
Read More :
Amazon | 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ షురూ.. ఆ ఫోన్లపై భారీగా డిస్కౌంట్